Monday, 16 February 2026

#మాఘఅమావాస్య: పరిహారం17.02.2026, మంగళవారంతిథి ప్రారంభం - Feb 16 సాయంత్రం 05:33 నుండి తిథి ముగింపు - Feb 17 సాయంత్రం 05:30 వరకు.మాఘఅమావాస్య - పితృ తిథి, శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ప్రీతి తిథి అమావాస్య. #MaghaAmavasya సనాతన హిందూ సంప్రదాయంలో మాఘ అమావాస్య అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన అమావాస్య తిథి. మాఘ మాసంలో చివరి రోజును మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య (మౌనం పాటించే అమావాస్య అంటే అనవసరమైన అక్కర్లేని విషయాలను ప్రస్తావన చేసుకోవడం, మరియు కోపతాపాలన ప్రదర్శించకుండా మౌనంగా మనసులో పరమాత్మ నామాన్ని స్మరణ చేసే పర్వదినం) అని పిలుస్తారు. ప్రతి నెల అమావాస్య ప్రత్యేకమైనది కానీ మాఘ అమావాస్య అసాధారణమైనది. ఈ రోజు పితృదేవతలకు తర్పణం, శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ పూజ, పవిత్ర స్నానం, దానధర్మాలు చేయడం వల్ల అపార పుణ్యం లభిస్తుంది. అమావాస్య మహత్వం - చంద్రుడు అదృశ్యమయ్యే దినంఅమావాస్య అంటే "చంద్రుడు లేని రాత్రి". అమావాస్య రోజు చంద్రుడు పూర్తిగా అదృశ్యమవుతాడు - ఆకాశంలో కనిపించడు. చీకటి రాత్రి.జ్యోతిష్య శాస్త్రం మంత్రం శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు చంద్రుడు బలహీనంగా ఉంటాడు. చంద్రుడు మనస్సుకు, భావోద్వేగాలకు, మానసిక శాంతికి కారకుడు. కావున అమావాస్య రోజు మనస్సు కొంచెం అస్థిరంగా, భావోద్వేగంగా ఉంటుంది. కానీ ఇది ఆధ్యాత్మిక సాధనకు, ఈ కాలం ద్వారా వచ్చే సమస్తమైనటువంటి చీకట్లను తొలగించి జ్ఞానాన్ని అందించే శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ నామ జపము చేయుటకు, స్వామిని దర్శించుటకు అత్యంత అనుకూలమైన మహా పర్వదినము.. చీకటి రాత్రి మనల్ని లోలోపల చూసుకునేలా చేస్తుంది. బాహ్య ప్రపంచం నుంచి లోలోపల ఆత్మ వైపు మళ్లించే శక్తి అమావాస్యకు ఉంది. ఈ ఆత్మకు చైతన్య శక్తిని, మనసుకు పరమానందాన్ని, జీవితానికి జన్మ సార్ధకతను ప్రసాదించే సాక్షాత్తు సర్వేశ్వరుడే శ్రీ లక్ష్మీ మాతతో శ్రీ కుబేర స్వామితో ధన ధాన్య స్వర్ణ వజ్ర వైడూర్య మణి మాణిక్యాలతో , దగ దగ దేదీప్యమాన అష్టభైరవ కాంతి కిరణాల మధ్య కొలువుతీరి , ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించే శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారిని దర్శించడం స్వామి నామ జపము చేయడం పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తూ ఉంటారు.🔱🪔పూజా విధానం. ఉదయం గాని రాత్రి గాని చేయవచ్చు. శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి చిత్రపటం ఎదురుగాఒక ఇత్తడి పళ్ళెంలో 5రావి చెట్టు ఆకులను ఉంచి, ప్రతి ఆకు పైన ఓం అనే అక్షరాన్ని గంధంతో రాయాలి. ఆ ఐదు రావి చెట్టు ఆకుల పైన పెద్ద మట్టి ప్రమిద (ఎరుపు రంగు) ఉంచాలి. ఆ ప్రమిదలో 8 జ్యోతులు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రము జపిస్తూ వెలిగించాలి. "ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం, ధనం, ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా "ప్రతి జ్యోతికి రెండు వత్తులు కలిపి చేయాలి. మొత్తం 8జంటల వత్తులు (16సన్నని వత్తులు జంటగా కలిపి 8) వెలిగించాలి. కొబ్బరి నూనె పోసి వెలిగించాలి.🌳వృక్ష పూజ మాఘ అమావాస్య రోజు రావిచెట్టు (పీపల్ చెట్టు) చాలా ప్రత్యేకమైనది. రావిచెట్టుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. రావిచెట్టుకు పోయడం, పసుపురంగు దారం 33 మార్లు ప్రదక్షిణం చేస్తూ శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రము జపం చేస్తూ కట్టడం వల్ల ఋణదోషాలు తీవ్ర అప్పుల బాధలు నివారణ అగును. ధన వృద్ధి, ధాన్య వృద్ధి స్వర్ణ వృద్ధి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. శనిదోషం, శని సాడేసాతి, అష్టమ శని, శని బాధలు నివారణ అగును. ఉత్తమ జీవిత భాగస్వామి కళ్యాణ సిద్ధి, సంతాన ప్రాప్తి కలుగుతుంది.పితృదోషం తొలగి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమృద్ధి కలుగుతుంది. శత్రు భయ నివారణ కోసం: శత్రువుల బాధ, శత్రు భయం తొలగును. మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, డిప్రెషన్ తొలగుతుంది. సర్వ పాపాలు హరించబడతాయి. జన్మజన్మాంతరాల పాపాలు, దోషాలు తొలగుతాయి. పితృదోషం పూర్తిగా నాశనమవుతుంది. పితృదేవతలు తృప్తి చెంది అపార ఆశీర్వాదాలు ప్రసాదిస్తారు. తేజస్సు, శక్తి, విజయం, సంతాన సౌభాగ్యం, ఆర్థిక సంపద, ఆరోగ్య దీర్ఘాయుష్షు, మానసిక శాంతి, ఆత్మిక ప్రగతి, కుటుంబ సౌఖ్యం, శత్రునాశనం, సర్వ శుభాలు సిద్ధించాలని ప్రార్థిస్తున్నాం! మీ చుట్టూ రక్షణ కవచం ఏర్పడాలి! శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దివ్య శక్తులు మీకు తోడుగా నిలవాలి!🛕దేవాలయాల్లో, మఠాలలో పీఠాలలో కొబ్బరి నూనె, ఆవునెయ్యి సమర్పణ చేయాలి.మౌనవ్రతం పాటించడంమాఘ అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు కావున ఈ రోజు మౌనవ్రతం పాటించడం అత్యంత శక్తివంతం. ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా పూర్తి రోజు మాట్లాడకుండా ఉండాలి. అవసరమైన పనులు చేయవచ్చు కానీ మౌనం పాటించాలి. ఈ సమయంలో ధ్యానం, మంత్ర జపం, పూజ, పారాయణం చేయాలి. మౌనం పాటించడం వల్ల:మానసిక శక్తి అపారంగా పెరుగుతుంది. వాక్ శుద్ధి పెరుగుతుంది బలపడుతుంది - మళ్లీ మాట్లాడినప్పుడు మన మాటలు శక్తివంతంగా ఉంటాయిఆధ్యాత్మిక అభ్యున్నతి సాధ్యమవుతుందిఏకాగ్రత పెరుగుతుందిఅనవసర వాదోపవాదాల నుంచి దూరంగా ఉండండి.మాఘ అమావాస్య చేయకూడని పనులు:మాఘ అమావాస్య రోజు మాంసాహారం, మద్యం, ధూమపానం, పొగాకు వదిలేయండి - కనీసం ఈ ఒక్క రోజు నల్లని వస్త్రాలు ధరించకండి. ఎందుకంటే అమావాస్య చీకటి రోజు, మళ్లీ నల్లని వస్త్రాలు ధరిస్తే మరింత చీకటి పెరుగుతుంది. తెల్లని, పసుపు, లేత వర్ణ వస్త్రాలు ధరించడం శుభకరం.ప్రతికూల ఆలోచనలు చేయకూడదు - అమావాస్య రోజు మన ఆలోచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి, ప్రతికూలంగా ఆలోచిస్తే అవి ప్రతికూలంగానే సాకారమవుతాయి.ఇంటిని, మీ పూజ మందిరాన్ని శుభ్రంగా ఉంచాలి. మురికి ప్రదేశాల్లో ప్రతికూల శక్తులు, చెడు శక్తులు శీఘ్రంగా ప్రవేశిస్తాయి. కావున ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, దీపాలు వెలిగించాలి."ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం, ధనం, ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా "ఓం శ్రీ కాలభైరవాయ నమః!! ఓం శాంతి శాంతి శాంతిః! #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ #kalabhairavaswamyji

Thursday, 27 November 2025

#GummadiKayaDeepaalu #KushmandaDeepaalu #KushmandaBaliDeepam #What Is #GummadiKayaDeepaalu #GummadiKayaDeepamSideeffects #KusmandaDeepamSideeffects #KushamandaDeepamVeryDanger⚡ఈ గుమ్మడికాయ బలి హోమ ప్రక్రియలో మంత్ర పూర్వకంగా మాత్రమే చేస్తారు. ఎవరు బడితే వారు ఎక్కడబడితే అక్కడ వెలిగించడం అనర్ధాన్ని కలిగిస్తుంది. #గుమ్మడికాయబలిదీపాలు వెలిగించాలి అంటే తలారా స్నానమాచరించి, తడి బట్టలలో, పండితుల ఆధ్వర్యంలో బలిదాన మంత్రమును పటిస్తూ గుమ్మడికాయని బద్దలు కొట్టి లోపల పసుపు రాసి, ఎనిమిది చోట్ల బొట్లు పెట్టి, అష్టభైరవులను ఆవాహన చేసి, పంచోపచార పూజ చేసి అష్టదిక్కులకు అష్ట జ్యోతిలను మంత్రపూర్వకంగా వెలిగించి ఆ దీపం వెలిగే వరకు అక్కడే కూర్చుని దీపం నిథనమైన తరువాత దానిని దూరంగా ఎక్కడైనా జంతువులు తిరగరాని ప్రదేశంలో వదిలేసి మరలా తలారా స్నానం చేసి, పొడి బట్టలు మార్చుకొని దేవతా దర్శనం చేసుకోవాలి. ఇంటిలో మాత్రం ఎప్పుడూ వెలిగించరాదు. ఇది కొన్ని దోషాలను కలిగిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు సృష్టిస్తుంది. ఈ గుమ్మడి కాయ బలి దీపాల పట్ల అవగాహన లేని వారు ఎవరో చెప్పిన లేనిపోని మాటలు విని కోరి దోషాలను ఆటంకాలను కోరి తెచ్చుకోవద్దు. అనేది గురువుల యొక్క సలహా. #KalabhairavaTV https://youtube.com/c/Kalabhairavatv

Monday, 24 November 2025

#మార్గశిరమాసం 21.11.2025 శుక్రవారం నుండి 20.12.2025 వరకు #కాలభైరవజయంతి #KalabhairavaJayanthi #Kalabhairavashtami 12.12.2025*మార్గశిరమాసం జీవిత లక్ష్యాలను, అభీష్టాలను సాధించడం కోసం మార్గాలను సుగమం చేసే మాసం. అంటే ఈ మాసంలో మనం ఏదైనా అనుకుంటే శీఘ్రంగా ఫలిస్తుంది. ఎందుకంటే ఈ మాసంలో సాక్షాత్తు మహాదేవుని నుండి #రుద్రాంశసంభూతుడు, #దిగంబరుడు, #ధర్మదాత, #విధాత, సంధాత, #కాలప్రభువు, రక్షకులందర్నీ శాసించే క్షేత్రపాలకుడు కాలాన్ని శాసించే కాలస్వరూపుడు #కాలభైరవుడు ఆవిర్భవించిన మార్గశిర మాసంలోనే భగవద్గీత అవతరించింది, శ్రీకృష్ణుడు దీనిని "మాసానాం మార్గశీర్షోహం" అని పేర్కొన్నాడు. #WhoIsKalabhairava #WhenIsKalabhairavashtami#SwarnakarshanaBhairavaTemple#స్వర్ణాకర్షణభైరవదేవాలయం #KalabhairavaTV #KalabhairavaGuru #RAJAHMUNDRYKALABHAIRAVATEMPLE#KaryaSiddhiKalabhairavaTempleRajahmundry కార్యసిద్ధికాలభైరవఆలయంరాజమండ్రి🛕మీకు స్వాగతం - సుస్వాగతం🛕 కార్యసిద్ధికాలభైరవస్వామి వారి స్వర్ణాకర్షణకాలభైరవ స్వామి వారి, వజ్రవారాహీఅమ్మవారి దర్శనం ప్రతి ఆదివారం అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో ఉదయం7:30 నుండి మధ్యాహ్నం11:45 వరకు ఉంటుంది.MORNING 7:30 AM To AFTERNOON 11:45AM ONLY.#గుడిఅడ్రస్ 👇 లొకేషన్https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=acవివరాలకు👇 https://www.facebook.com/kalabhairavaTVhttps://youtube.com/c/Kalabhairavatv 🙏Thanks For Your Support..వివరాలకు వాట్సాప్ 📱@9000200117ఈ మాసంలో కాలభైరవ మహాకాళి దశమహావిద్య సాధన ఉపాసన అనుష్టానం ఆరాధన, ముఖ్యంగా ఆదివారాలలో చేసే పూజలు, ఉపవాసాలు విశిష్ట ఫలితాలనిస్తాయి. ఈ నెలలో కార్తికేయుడు, దత్తాత్రేయుడు కూడా అవతరించారు.మార్గశిర మాసం యొక్క విశిష్టతలు:భగవద్గీత మాసం: శ్రీకృష్ణుడు భగవద్గీతను ఈ మాసంలోనే బోధించాడు. మహాకాళి కాలభైరవ ప్రీతి: ఈ మాసం శ్రీ కాలభైరవ స్వామి వారికి శ్రీ మహాకాళి మాతకు చాలా ప్రీతికరం. ఆదివారాల ప్రాముఖ్యత: మార్గశిర ఆదివారాలను "మార్గశిర భానువారాలు" అని పిలుస్తారు మరియు వీటిని శ్రీ మహా కాళీ కాలభైరవ పూజలకు అంకితం చేస్తారు. వైకుంఠ ఏకాదశి: మార్గశిర శుక్ల ఏకాదశిని "వైకుంఠ ఏకాదశి" అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఆధ్యాత్మిక అనుష్ఠానాలు: ఈ నెలలో దీపారాధన, కాలభైరవ సహస్రనామ పారాయణం, సాత్విక ఆహారం పాటించడం వంటివి చేస్తారు. ఓం శ్రీ గురుభ్యోనమః ది 12.12.2025 శుక్రవారం కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రిశ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయంలో నిర్వహించు కార్యక్రమాలు 1.కార్యసిద్ధి కాలభైరవ స్వామికి కంకాల హారతి సేవ ఉదయం 7 గం.లకు, ఈ కలియుగంలో కాల ద్వారా కలిగే సర్వకష్టాల నుండి, దోషాల నుండి, సమస్యల నుండి విముక్తి కలిగించమని వేడుకొంటూ చేసే సేవయే కంకాల హారతి సేవ కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారికి ప్రీతికరమైనది. 2.స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారికి సర్పాహారతి సేవ 3.ధన ప్రసాద సేవ4.అన్నప్రసాద సేవ 5.కార్యసిద్ధి కాలభైరవ దీప పూజ 5.మాస పూజలు 6.కాలభైరవ స్వామికి విశేష పూజలు హోమాలు7.రాజ శ్యామల మాతకు విశేష పూజలు హోమాలు 8. శ్రీ వారాహీ మాతకు విశేష పూజలు హోమాలు9.మంత్రోపదేశ సేవ విశేష పౌర్ణమి పర్వదినాల్లో మంత్రోపదేశ సేవలు జరుగును 10.కాలభైరవ దీక్షలు మార్గశిర బహులాష్టమి కాలభైరవ జయంతికి ముందు 41 రోజుల 21 రోజుల 11 రోజుల కాలభైరవ దీక్షను స్వీకరించవచ్చు.

Friday, 14 November 2025

#మంత్రోపదేశం #Mantropadesham #మంత్రంసాధన చేసేవారు, లేదా మంత్రం పట్ల శ్రద్ధ ఉన్నవారు, లేదా #మంత్రోపాసన చేయాలనుకునేవారు,లేదా జీవిత సత్యాన్ని సాధించాలనుకునేవారు, లేదా జన్మ సార్ధకత కావాలనుకునేవారు, లేదా ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవాలనుకునేవారు, ఈ జన్మకు ముక్తి మోక్షము కావాలనుకునేవారు మంత్ర దేవత యందు, గురువు నందు పూర్తి విశ్వాసము భక్తి శ్రద్ధ చిత్తశుద్ధితో అడిగితేనీ కానీ ఇవ్వకూడదు మంత్రము. ఒక్కొక్కప్పుడు గురువుల అనంత అవ్యాజమైన కృపతో ఇస్తారు. గురువును దర్శించి, భక్తి పూర్వకంగా అడగాలి. శిష్యుని కొంతకాలం పరీక్షించి ఇవ్వాలి గురువు. మంత్రాన్ని ఇవ్వడం అంటే గురువు తన జీవితంలో జపం చేసి సాధన చేసినటువంటి శక్తిని అక్షర రూపంలో దేవతను ఇవ్వడమే. మరియు మంత్రశక్తిని శిష్యునికి ధారబోయడమే మంత్రఉపదేశం.అలా ఉపదేశం పొందినటువంటి శిష్యుడు జీవిత కాలం మంత్ర దేవత యందు గురువు యందు చిత్తశుద్ధి కృతజ్ఞత కలిగి ఉండాలి అప్పుడే మంత్ర దేవత యొక్క అనుగ్రహం చేత శిష్యునికి సర్వ అభిష్టాలు నెరవేరుతాయి.మంత్రాన్ని అక్షరంగా చూసేవాడు, గురువును మనిషిలా చూసేవాడు, విగ్రహాన్ని శిలలా చూసేవాడు ఎన్నటికీ మంత్ర సిద్ధి కలగదు. విగ్రహంపై శిలాదృష్టి, గురువుపై మానుష దృష్టి, మంత్రంపై అక్షరదృష్టి కూడదు. సాక్షాత్ భగవదృష్టి ఉండాలి. ఏ మంత్రమైనా సరే గురు అణుజ్ఞతో, గురు ఉపదేశంతో సిద్ధిస్తుంది. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా 109 మంత్రోపదేశములు విజయవంతంగా సంపూర్ణం చేయడం, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 16450 మంది భక్తులు పాల్గొని తరిస్తున్నారు. మన కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రి ఆధ్వర్యంలో #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ వారి పర్యవేక్షణలో #110వమంత్రోపదేశం త్వరలో జరుగునని తెలియజేయుటకు మిక్కిలి సంతోషిస్తున్నాము.ఈ ముఖ్య సమాచారాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలనుకునే మన ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వివరాలకుhttps://www.facebook.com/kalabhairavaTVమంత్రోపదేశ క్షేత్రం కొరకు క్లిక్ చేయండి.https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=acమరిన్ని వివరాలకు వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు.📱@9000200117

Saturday, 8 November 2025

Rajahmundry kalabhairavatempleDarshan #KotiDeepotsavam #KarteekaKotiDeepotsavam #కాలభైరవక్షేత్రంలోకోటిదీపోత్సవం స్వాగతం - సుస్వాగతం *రాజమండ్రి కాలభైరవక్షేత్రంలో కోటిదీపోత్సవం**ది.09.11.2025 ఆదివారం సాయంత్రం 6గంటలకు*కార్తీక మాసం సందర్భంగా రాజమండ్రి నగరంలోని ఆర్యాపురంలో కాలభైరవ గురు సంస్థాన మఠం, శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయం, కాలభైరవదీక్ష ఘాట్ లో భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు, మహామంత్రోపదేశకులు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో *కోటిదీపోత్సవం #KotiDeepotsavam* జరుగును. కావునా భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ స్వహస్తాలతో స్వయంగా మూలవిరాట్ కు అభిముఖంగా గోదావరి ఒడ్డున కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రలు కాగలరు.ఇట్లు:భారతీయ సనాతన ధర్మ పరిషత్ - ఆంధ్రప్రదేశ్.కాలభైరవ గురు పరివార్ రాజమండ్రి శాఖ.